విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా...! నేతలపై లోకేశ్ ఆగ్రహం!
Mon May 19, 2025 16:29 Politics
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్యంగా వాయిదా పడటం అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్లు తగినంత సంఖ్యలో హాజరుకాకపోవడమే దీనికి కారణం. ఈ పరిణామంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు జరగాల్సిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు మొత్తం 74 మంది సభ్యులకు గాను కేవలం 54 మందే హాజరయ్యారు. ఎన్నిక నిర్వహణకు కనీసం 56 మంది సభ్యుల కోరం అవసరం కాగా, ఇద్దరు సభ్యుల కొరత ఏర్పడింది. దీంతో అధికారులు ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కౌన్సిల్ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయినప్పటికీ, పలువురు గైర్హాజరు కావడం గమనార్హం.
ఈ పరిణామాలపై టీడీపీ అధిష్ఠానం సీరియస్గా దృష్టి సారించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఈ ఎన్నికకు గైర్హాజరైన కార్పొరేటర్లకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. కొందరిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడవద్దని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కీలక సూచనలు చేసినట్లు తెలిసింది.
ఈ పరిణామాలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ... జీవీఎంసీలో తమకు కావాల్సినంత సంఖ్యాబలం ఉందని తెలిపారు. "డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోవడంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. గత రాత్రి 11 గంటలకు ఆ పదవిని జనసేన పార్టీకి కేటాయించాలని నిర్ణయించాం" అని పల్లా తెలిపారు. టీడీపీలో కూడా ఆ పదవిని ఆశించేవారు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఎన్నిక వాయిదా పడటానికి సమన్వయ లోపం కూడా ఒక కారణమని, అందుకే ఈ ఇబ్బంది తలెత్తిందని ఆయన అంగీకరించారు. జీవీఎంసీ కౌన్సిల్కు సభ్యులంతా హాజరవుతారని, దీనికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
రేపు జరగనున్న ఎన్నికకు సభ్యులందరూ హాజరై, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసేలా చూడాలని పార్టీ శ్రేణులకు అధిష్ఠానం నుంచి గట్టి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం విశాఖ రాజకీయాల్లో కొంత అలజడి సృష్టించింది.
ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!
ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్కు బాంబు బెదిరింపులు..
ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?
ఈ-పాస్పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!
లోకేశ్ తాజాగా కీలక సూచనలు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!
మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #VizagPolitics #DeputyMayorElection #LokeshFires #TDPNews #PoliticalDrama #AndhraPolitics #VizagUpdates
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.